జగిత్యాల అర్బన్ ఎంపీపీ మ్యాదరి వనిత ఆఖస్మిక మృతి

Published: Friday June 25, 2021
జగిత్యాల, జూన్ 24 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల అర్బన్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మ్యాదరి వనిత గురువారం రోజున ఉదయం ఆఖస్మికంగా మృతి చెందారు. ఆమె మృతి పట్ల నాయకులు అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్శి ఆమె ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వనిత మృతి తీరని లోటని వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.