శ్రీ దుర్గాపరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం
Published: Saturday August 06, 2022
మేడిపల్లి, ఆగస్టు5 (ప్రజాపాలన ప్రతినిధి)
శ్రావణ మాసం సందర్భంగా వెలుగు గుట్ట శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాపరమేశ్వరి అమ్మవారికి శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ఉదయం 6 గంటల నుండి పంచామృత అభిషేకము, శ్రీ సూక్త, దుర్గా సూక్త విధానంతో మహా అభిషేకం అహంకారం, సుహాసునలచే కుంకుమార్చనలు మరియు వడి బియ్యం అత్యంత వైభవంగా నిర్వహించారు .అలాగే వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయంలో జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలులో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు .ఈ విశేష ఆర్జిత సేవల్లో పాలుపంచుకుని మహిళలు విశేషమంగా వాయినాలు సమర్పించుకున్నారు. ఈ విశేష ఆర్జిత సేవల్లో పాలుపంచుకునే భక్తులందరినీ ఆ జగన్మాత అనుగ్రహించాలని దేవాలయ అర్చక సిబ్బంది మరియు భక్తులు అమ్మవారిని వేడుకున్నారు.
Share this on your social network: