శివాలయం ప్రధాన రహదారి రోడ్డు లెవలింగ్ పనులను ప్రారంభోత్సవం

Published: Thursday June 10, 2021
మేడిపల్లి, జూన్ 9, (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ కెనరా నగర్ కాలనీలోని శివాలయం ప్రధాన రహదారి ఎన్నో సంవత్సరం నుంచి చిన్నపాటి వర్షానికి ముంపుకు గురై వర్షపు నీరు ఇండ్లలోకి అపార్ట్ మెంట్ లోకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోతున్నాయి. వర్షం కురిసిన ప్రతిసారి కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్టి సమస్యను కాలనీ పెద్దలతో చర్చించి మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్  పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డితో కలిసి రోడ్డు లెవలింగ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ శ్రీనివాస్, నాయకులు పప్పుల అంజి రెడ్డి, కాలనీ పెద్దలు ధర్మరాజు,ఎన్ వేణు, శ్రీనివాస్, మద్దిలేటి, ఉన్నం శ్రీనివాస్, రమణారెడ్డి, ప్రేమ్ చంద్, వెంకన్న, భూపాలం, దయాకర్, అనిల్, సుదర్శన్ రెడ్డి, బుచ్చిబాబు, గోపి రెడ్డి, రామారావు, శాస్త్రి, బాలాజీ, అఖిల్, సాయి, శ్రీకాంత్ పటేల్  తదితరులు పాల్గొన్నారు.