రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలి

Published: Wednesday February 16, 2022

ప్రో. నునావత్ దేవదాస్ నాయక్

జగిత్యాల, ఫిబ్రవరి 15 (ప్రజాపాలన ప్రతినిధి): మల్లాపూర్ మండలం సీరిపూర్ గ్రామంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి గ్రామ సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారతీయ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రో. నునావత్ దేవదాస్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నునావత్ దేవదాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తునందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సెలవు గా ప్రకటించాలని కేసీఆర్ ని విజ్ఞప్తి చేశారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఉపదేశాలను తీసుకొని సమస్త బంజారా జాతి ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి ప్రవర్తనతో సమాజంలో మసలుకోవాలని,  ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ కోటిపల్లి సరోజన అదిరెడ్డి, తహశీల్దార్ రవీందర్, ఎంపీడీఓ రాజా శ్రీనివాస్, సబ్ ఇన్స్ పెక్టర్ నవీన్ కుమార్, ఎంపీటీసీ రాంరెడ్డి, టీ టీ యు జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, టీ ఆర్ యస్ మండల్ అధ్యక్షులు తోట శ్రీనివాస్, విట్ఠల్, శివాలాల్, బాధవత్ రాము నాయక్, సభవత్ లింబా నాయక్, తిరుపతి, రాజు నాయక్, మల్లేష్, బాధవత్ శేఖర్, వినోద్, పరమేష్ తదితరులు హాజరయ్యారు.