భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు జెండా ఆవిష్కరణ శంకరపట్నం మార్చి05 ప్రజాపాలన రిపోర్

Published: Tuesday March 07, 2023

శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఆధ్వర్యంలో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా విభాగం ఆదివారం మండల కేంద్రంలో ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లమ్మ మాట్లాడుతూ జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేసి మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నట్లు తెలియజేశారు. ప్రతి మహిళ అభ్యున్నతికి పాటుపడుతూ మహిళలను సంఘటితం చేస్తూ మహిళా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ప్రీతి మృతికి సంతాపం తెలియజేస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను, హత్యలను, అత్యాచారాలు, అన్యాయాలను మహిళలందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నగర కార్యదర్శి కొట్టే అంజలి, సభ్యులు ములుగు లక్ష్మి, మాచర్ల పద్మ, మాచర్ల స్వరూప, పిట్టల రాజేశ్వరి, పిట్టల రమ, సుంకరి తిరుమల చాడ తిరుమల, సిపిఐ మండల సహాయ కార్యదర్శి సదానందం, దొమ్మడి వెంకటస్వామి, భూక్య పవన్ తదితరులు పాల్గొన్నారు.