ఇబ్రహీంపట్నం జూలై తేదీ 7 ప్రజాపాలన ప్రతినిధి
*సొంత గ్రామానికి 90 లక్షలు ఇచ్చిన వినాయక్ రెడ్డి*
*ఎంపీ కోట నుండి గడ్డమల్లయ్యగూడ అభివృద్ధి కోసం 20 లక్షల నిధులు మంజూరు చేస్త ---కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని గడ్డమల్లయ్య గూడా గ్రామంలో స్థానిక పార్లమెంటు సభ్యులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి,కొత్త కురుమ శివకుమార్ , గడ్డమల్లయ్యగూడ సర్పంచ్ అచ్చన జంగయ్య ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి వివిధ అభివృద్ధి పనులను సమీక్షించారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన వినాయక్ రెడ్డి జీవితంలో ఎంత ఉన్నత స్థితికి ఎదిగిన తన సొంత గ్రామాన్ని మరిచిపోకుండా 90 లక్షల రూపాయలు సొంత నిధులతో గ్రామంలో అనేక మౌలిక వసతుల కోసం అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి,సిసి రోడ్లు , చుట్టుపక్కల గ్రామంలో కూడా వాటర్ ప్లాంట్లు నేల్కొల్పడం నిజంగా చాలా అభినందనీయమైనటువంటి విషయమని,ఇంకా తాను తన చిన్ననాటి క్లాస్మేట్ అయినందుకు గర్వకారణంగా ఉందన్నారు. అనంతరం వినాయక్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.విద్యా సంవత్సరం మొదలై మూడు నెలలు కావస్తున్న విద్యార్థులకు కనీస వసతులు అయిన పుస్తకాలు డ్రెస్సులు ప్రభుత్వం అందించకపోవడం చాలా బాధాకరమని,తన సొంత నిధులతో సుమారు 130 మంది విద్యార్థులకు రెండు జతల డ్రెస్సులు,షూస్ పుస్తకాలు,కొనిస్తానని హామీ ఇచ్చారు. నియోజవర్గంలోని అనేక అభివృద్ధి పనులకు తన చేయూతనిస్తున్న మర్రి నిరంజన్ రెడ్డిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య భాష,ఎంపీడీవో విజయలక్ష్మి, అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెన్నార్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: