పలు కుటుంబాలను పరామర్శించిన వైస్ ఎంపిపి కంచుగట్ల వీరభద్రం, పినపాక నియోజకవర్గం ఎస్సీ విభాగం

Published: Saturday October 08, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ప్రజా పాలన.
ఈ రోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు  ఆదేశాల మేరకు గత కొన్ని రోజుల క్రితం గొందిగూడెం గ్రామ పంచాయతీ ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ భర్త కొమరం నరసింహారావు గత కొన్ని రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మరణించగా వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. అంతేకాకుండా వారి కుటుంబాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అనునిత్యం అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో  వైస్ ఎంపిపి కంచుగట్ల వీరభద్రం, పినపాక నియోజకవర్గం ఎస్సీ విభాగం అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, కన్నెబొయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.