ముమ్మరంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ

Published: Friday June 17, 2022

బోనకల్, జూన్ 16 ప్రజాపాలన ప్రతినిధి : తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ భాగంగా గురువారం మండల పరిధిలోని రాయనపేట గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయనపేట తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు తూము పురుషోత్తం కు మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ ,తూము పురుషోత్తమరావు, పారా వెంకటేశ్వరరావు,మంద నరేంద్ర కుమార్,తోటకూర వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.