సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం* * చెక్కు అందజేసిన పల్లపు విగ్నేష్*

Published: Thursday August 18, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 17ప్రజాపాలన ప్రతినిధిసీఎం సహాయ నిధి పేదలకు వరం అని సిపిఎం గ్రామ కార్యదర్శి కార్యదర్శి పల్లపు విగ్నేష్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల్ కప్ప పహాడ్ గ్రామానికి చెందిన జంగిలి.అనిత కు గత సంవత్సరం అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది అందుకుగాను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి  సహాయ సహకారాలతో  సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 21000వేల రూపాయల చెక్కును వారు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం గ్రామ కార్యదర్శి పల్లపు విగ్నేష్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో పేదలకు అందుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సిరెడ్డి స‌హ‌కారంతో నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే అనేక మందికి సీఎం సహాయ నిధి నుంచి లబ్ధి చేకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శులు జంగిలి. దాసు,చాతాళ్ళ. సురేష్,  నాయకులు జగన్, జంగిలి. నరసింహ జంగిలి యాదయ్య జంగిలి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.