ప్రజలకు అందుబాటులో ఉంటాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి నిరంజన్ రెడ్డి

Published: Monday November 08, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం బండలేముర్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సరఫరా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు, సర్పంచ్, ఎంపిటిసి కోరిక మేరకు అడిగిన వెంటనే తన సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలలో బోరు వేయించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు మర్రి నిరంజన్ రెడ్డి గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు, గ్రామస్తులు మరియు ప్రభుత్వ పాఠశాల  హెడ్మాస్టర్ మరియు ఉపాధ్యాయ బృందం మర్రి నిరంజన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగ శ్రీనివాస్ నాయక్, ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, మండల ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షుడు ఎడ్మా నరేందర్ రెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ వాజిద్ బాయ్, pacs డైరెక్టర్ హన్మంతు రెడ్డి, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.