సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న భక్తులు..
Published: Monday October 10, 2022
తల్లాడ, అక్టోబర్ 9 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ మండలంలోని అంజనాపురం గ్రామంలో ఉన్న సమ్మక్క, సారలమ్మలను ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు భూక్యా వెంకటేశ్వర్లు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేశారు. తొలుత భక్తులు అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం భూక్యా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలు ఆది, బుధవారాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా వస్తున్నారన్నారు. దాతల సహకారంతో సీసీ కెమెరాలు, ప్రహరీ గోడ తదితర ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.*
Share this on your social network: