నూతన ఆలయంలో శ్రీ సాయి బాబా విగ్రహం ఏర్పాటు మాజీ కార్పొరేటర్ జోత్స్నా నాగేశ్వరావు

Published: Wednesday January 25, 2023
మేడిపల్లి, జనవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి)  
రామంతాపూర్ డివిజన్ రాజేంద్రనగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో రూ1.35 లక్షలతో 4 ఫీట్ శ్రీ సాయి బాబా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు విగ్రహ దాత మాజీ కార్పొరేటర్ గంధం జోత్స్నా నాగేశ్వరావు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం జరుగుతున్న తరుణంలో  కాలనీ వాసులందరూ కలిసి ఆలయ నిర్మాణ సహాయం కొరకు మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు కలవటం జరిగింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా కాలనీ వాసులందరితో మాట్లాడి తమవంతు సహాయంగా మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా విగ్రహన్ని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.ఈ విగ్రహన్ని  షిరిడీ నుంచి తెప్పించటం జరిగింది.