డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ..

Published: Tuesday February 01, 2022
తల్లాడ, జనవరి 31 (ప్రజాపాలన న్యూస్): మండల పరిధిలో పినపాక గ్రామంలో మండల పరిషత్ నిధుల ద్వారా మంజూరైన డ్రైనేజీ పనులకు సోమవారం ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సహకారంతో మండల పరిషత్ ద్వారా ఈ నిధులను మంజూరు చేయించారని పేర్కొన్నారు. తల్లాడ మండలంలో గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే భారీగా నిధులు మంజూరు చేయించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ దుగ్గి దేవర వెంకట్ లాల్, ఎంపీటీసీ తెల్లపుట్ట మాధవి, పంచాయతీ కార్యదర్శి  సుధీర్ తదితరులు పాల్గొన్నారు.