స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్న 'ఎమ్మెల

Published: Saturday September 17, 2022
అశ్వారావుపేట ప్రజా పాలన ( ప్రతినిధి) అశ్వారావుపేట లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల యందు శుక్రవారం జరిగిన జాతీయ సమైక్యత కార్యక్రమంలోభారత 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా అశ్వరావుపేటలో ఆగస్టు 14వ తేదీన ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో నృత్యాలు చేసిన చిన్నారులకు గౌరవ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు  చేతుల మీదుగా జిల్లా పౌర సంబంధాల శాఖ వారు పంపిన  ప్రశంసా పత్రాలను కళాకారులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి  సారధి కళాకారిణి సత్యవాణి, డాన్స్ మాస్టర్ సర్విందు, యశ్విత, భావన, లాస్య పాల్గొన్నారు.