త్రిబుల్ ఐటీ బాసర కళాశాలకు ఎంపికైనా కంచర్ల నిత్యశ్రీ

Published: Friday August 20, 2021
బోనకల్, ఆగస్టు 19, ప్రజాపాలన ప్రతినిధి : జడ్ పి ఎస్ ఎస్ గోవిందాపురం(ఎల్) పాఠశాలకు చెందిన కంచర్ల నిత్యశ్రీ త్రిబుల్ ఐటీ బాసర కళాశాలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి లక్ష్మీరాజ్యం తెలియజేశారు. ఈ సందర్భంగా నిత్యశ్రీ ని ఆమె తల్లిదండ్రులను కంచర్ల బాబు విజయ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీరాజ్యం, ఎస్ఎంసి చైర్మన్ కారంగుల లక్ష్మణ్ ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత వైస్ సర్పంచ్ కారంగుల చంద్రయ్య సిపిఎం గ్రామ శాఖ మాజీ ఎంపీపీ జెడ్పిటిసి కొమ్మ శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ ఉమ్మినేని బాబు వైస్ సర్పంచ్ కారంగుల చంద్రయ్య ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత సిపిఎం పార్టీ గ్రామ శాఖ మరియు, పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలమర్రి శివ నరసింహారావు, బాలస్వామి, నున్నా శ్రీనివాస రావు, అనంత రాములు, వీర రాజు, నాగభూషణం స్కూల్ సిబ్బంది తదితరులు అభినందించారు.