నల్లగండ్ల వాసుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తా : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Published: Thursday April 01, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల కాలనీ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హాజరైనారు. బుధవారం నాడు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కాలనీ వాసులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో నల్లగుండ్ల కాలనీ లో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీవాసులు తమ దృష్టికి తీసుకు వచ్చిన కాలనీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాలనీల్లో అవసరమైన చోట సిసి రోడ్లను, వీధిలైట్ల ను ఏర్పాటు చేస్తానని, డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో నే ఉంటూ, డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.