పీర్జాదిగూడ పాలకవర్గం ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీనివాస్ కు ఘనంగా వీడ్కోలు

Published: Friday October 01, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పదోన్నతిపై బదిలీ సందర్భంగా మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో వీడ్కోలు సన్మాన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, సీఐ అంజి రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు ఘనంగా కమీషనర్ ఎం. శ్రీనివాస్ ను సన్మానించి వీడ్కోలు పలికారు.