పీర్జాదిగూడ పాలకవర్గం ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీనివాస్ కు ఘనంగా వీడ్కోలు
Published: Friday October 01, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పదోన్నతిపై బదిలీ సందర్భంగా మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో వీడ్కోలు సన్మాన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, సీఐ అంజి రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు ఘనంగా కమీషనర్ ఎం. శ్రీనివాస్ ను సన్మానించి వీడ్కోలు పలికారు.
Share this on your social network: