ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday November 30, 2022

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ని పోల్కం పల్లి గ్రామంలో తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ్ల దానయ్య అధ్యక్షత న నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతితులుగా ఇబ్రహీంపట్నం ఎంపిపి కృపేష్, మండల తెరాస అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని  సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు టిఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణం పటిష్టం చేయడంలో ప్రతి గ్రామం నుండి 100 మంది కార్యకర్తలకు ఇద్దరిని ఇన్చార్జిగా నియమించడం జరిగిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చి పార్టీని బలోపేతం చేయాలని  టిఆర్ఎస్ ఒక్క పార్టీ మాత్రమే కాదని, అది తెలంగాణ ప్రజలకు రక్షణ కవచమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి, ఎంపీటీసీ  మంగ రవీందర్, దండుమైలారం పీఏసీఎస్  ఛైర్మెన్ బి. వెంకట్ రెడ్డి, మండల నాయకులు మంద సురేష్, డి. నర్సింహా,  కె. ప్రభాకర్ రెడ్డి, బీరప్ప, తదితరులు పాల్గొన్నారు.