మొక్కలు పంపిణీ చేసిన సర్పంచ్ మారెళ్ళ మమత..
Published: Wednesday July 13, 2022
తల్లాడ, జులై 12 (ప్రజాపాలన న్యూస్):
ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా మంగళవారం మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో మొక్కలను పంపిణీ చేశారు. వీటిని గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత చేతుల మీదుగా గ్రామస్తులకు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మమత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను తీసుకెళ్లి సంరక్షించాలని సూచించారు. మొక్కల ద్వారా సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. గ్రామంలో ఉన్న నర్సరీలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నట్లు వెల్లడించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోవిందు విజయమ్మ, ఉప సర్పంచ్ గోవిందు భాగ్యమ్మ, సెక్రటరీ వేణు, టిఆర్ఎస్ నాయకులు తుమ్మలపల్లి రమేష్, గోవిందు శ్రీనివాసరావు(ట్రాక్టర్), అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: