బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి గారి మృతికి సంతాపం

Published: Friday July 16, 2021
మధిర, జూలై 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం జాలీముడీ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ డైరెక్టర్ బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి గారి పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న, మాజీ మార్కెట్ చైర్మన్, జిల్లా ప్రధాన కార్యదర్శి, వేమి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, jalimudi గ్రామ సర్పంచ్, తడకమళ్ళ ప్రభాకర్, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు, దారా బాలరాజు, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, సైదా అల్లిపురం సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు, సొసైటీ డైరెక్టర్, దేవభక్తిని పెద్దబ్బాయి, మండల నాయకులు, పారుపల్లి విజయ్ కుమార్, రొంపి మల్ల సర్పంచ్, ఎస్.కె మదర్ సాహెబ్, గొల్లమందల శ్రీనివాసరావు, కరివేద రాంబాబు తదితరులు నివాళులు అర్పించి బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబానికి, వారి  ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసినారు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి చనిపోయిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్, మధిర శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క, బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు చరవాణి ద్వారా ఫోను చేసి జరిగిన విషయాన్ని తెలుసుకొని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసినారు, బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి లేని లోటు  కాంగ్రెస్ పార్టీకి ఎంతో  తీరనిలోటని  వారు పేర్కొన్నారు.