" పిడుగుపాటుతో 152 మేకల మృతి", యజమానులను ఆదుకోవాలి

Published: Wednesday September 14, 2022
జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు **
 
డిఆర్ఓ కదం సురేష్ కు వినతి **
 
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 12 (ప్రజాపాలన, ప్రతినిది) : తిర్యాని మండలంలోని గంభీరావుపేట కు చెందిన మృతిచెందిన మేకలు, గొర్రెలు, యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని డిఆర్ఓ కదం సురేష్ కు సోమవారం యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు, జెడ్పిటిసి, అరిగెల  నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పాటు పిడుగులు పడడంతో గంభీరావుపేట కు చెందిన ఆవుల భీమయ్య కు చెందిన 9, మల్లయ్య కు చెందిన 24, అప్పాల ఐలయ్య కు చెందిన 13, జడ ఐలయ్య కు చెందిన 26, మల్లేష్ కు చెందిన 25, సుజాత కు చెందిన 25, బుచ్చయ్య కు చెందిన 20, పోచమల్లు కు చెందిన 10, సనువులు సుమారుగా మొత్తం 152 మృతిచెందడంతో పెద్ద ఎత్తున వాటి యజమానులకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన యాదవులను ఆర్థికంగా లేదా, మళ్లీ వారికి జీవాలను అందజేసి ఆదుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో గంభీరావుపేట సర్పంచ్ ముత్యం రాజయ్య, మేకల యజమానులు పాల్గొన్నారు.