అనారోగ్యంతో వ్యక్తి మృతి

Published: Monday May 03, 2021
పరిగి, 2 మే, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, దోమ మండల పరిధిలోని దొంగేన్కెపల్లి  గ్రామంలో  అనంతమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో భాద పడుతూ ఆదివారం రోజు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తను స్వర్గస్తులు కావడం భాదకరమైన విషయం అన్నారు. మాజీ ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి సూచనల మేరకు సర్పంచ్ అశోక్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుమారుడు గణేష్ కి 5000/- తక్షణ అవసరాల కోసం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు రాజందర్ గౌడ్, టీచర్ రాములు (రాములన్న), గ్రామ జైబీమ్ యువజన సంగం అధ్యక్ష కార్యదర్శులు చెన్నయ్య, హనుమంతు, యాదయ్య, దినేష్, రాజేష్, శివ తదితరులు పాల్గొన్నారు