ఎర్రుపాలెం మండలంలో ఎస్సై ఉదయ్ కిరణ్ విస్తృత తనిఖీలు.

Published: Wednesday October 27, 2021
ఎర్రుపాలెం అక్టోబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి : ఎరుపాలెం పరిధిలోని గ్రామాలలో గంజాయి వంటి మారక ద్రవ్యాల పై ఇతర మత్తు పదార్థాలు అమ్మకాలు పై కిరాణా దుకాణాలు బడ్డీ కోట్ల లో ఎర్రుపాలెం ఎస్ఐ టీ ఉదయకిరణ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా గంజాయి, గుట్కాలు అమ్మినా నిల్వ ఉంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ట్రైనీ ఎస్ఐ కె వెంకటేష్ నాయుడు, కానిస్టేబుల్ ప్రకాష్ ఉన్నారు.