ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
Published: Thursday December 08, 2022
బోనకల్,డిసెంబరు 07 ప్రజా పాలన ప్రతినిధి:
మండల పరిధిలోని పెద్దబీరవల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మంగళవారం ఆర్ సీయం చర్చ్ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెబ్బవరం విచారణ ధైవ సేవకుడు రెవరెండ్ డాక్టర్ రూబేను హాజరై చిన్నారి బాల యేసు,క్రిస్టమస్ తాతయ్య తో సంస్థ సభ్యుల యొక్క కుటుంబాలకు వెళ్లి గృహ దర్శనం చేస్తు చిన్నారి బాల ఏసుకే జై అంటూ ప్రార్థన చేసి వాక్యం ప్రసంగించారు.ఫాదర్ రూబేను మాట్లడుతూ ఏసుక్రీస్తు ఎప్పుడూ ప్రేమను,కరుణను,క్షమను కలిగి ఉండాలని బోధించారని తెలిపారు.ప్రతిఒక్కరూ క్షమాగుణంతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే యావత్ ప్రపంచం సుఖఃశాంతులతో ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు జయరాజు,గురుస్వామి, సంఘ సభ్యులు,యువకులు పాల్గోన్నారు.
Share this on your social network: