ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
Published: Friday December 30, 2022
శంకరపట్నం డిసెంబర్ 29 ప్రజా పాలన రిపోర్టర్:
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో పోచమ్మ టెంపుల్ దగ్గరలో నిత్యం పొలం పనులకు రైతులు వ్యవసాయ కూలీలు వెళ్లే దారిలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో స్థానిక రైతులు పాదాచారులు భయభ్రాంతులలో లోనవుతున్నారు. ఈ సమస్యను తాడికల్ ఏఈ గారి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి త్వరితగతిన అక్కడినుంచి ట్రాన్స్ఫార్మర్ను వేరే స్థలంలోకి మార్చి సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారు.
Share this on your social network: