ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

Published: Friday December 30, 2022

శంకరపట్నం డిసెంబర్ 29 ప్రజా పాలన రిపోర్టర్:

శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో పోచమ్మ టెంపుల్ దగ్గరలో నిత్యం పొలం పనులకు  రైతులు వ్యవసాయ కూలీలు వెళ్లే దారిలో ప్రమాదకరంగా  విద్యుత్ ట్రాన్స్ఫార్మర్  ఉండడంతో స్థానిక  రైతులు పాదాచారులు భయభ్రాంతులలో లోనవుతున్నారు.  ఈ సమస్యను తాడికల్ ఏఈ గారి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా  స్పందించి త్వరితగతిన అక్కడినుంచి ట్రాన్స్ఫార్మర్ను వేరే స్థలంలోకి మార్చి సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారు.