ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 20ప్రజాపాలన ప్రతినిధి *టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలకు విద్యాశాఖ మ

Published: Wednesday December 21, 2022

ఈనెల 30వ తేదీన టీయూడబ్ల్యూజే 143 జిల్లా మహాసభలను నిర్వహిస్తున్న సందర్భంగా జర్నలిస్ట్ సంఘం నాయకులు టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసి ఆహ్వాన పత్రం అందజేయడం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ కల్వకోల్ లక్ష్మీదేవమ్మ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్న జిల్లా మహాసభలకు ప్రతి ఒక్క జర్నలిస్టు విధిగా హాజరు కావాలని  తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం రమేష్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు సురేమోని సత్యనారాయణ, రాజేంద్రనగర్ అధ్యక్షుడు కృష్ణ, మహేశ్వరం అధ్యక్షుడు రాజ్ కుమార్, ఎల్బీనగర్ చందర్, జిల్లా నాయకులు రాఘవేంద్ర చారి, సుమన్, వెంకటేష్, రాహుల్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.