కొండగట్టు అంజన్నకు కోటొక్క మొక్కులు గ్రామాలో కోవిడ్ నివారణకు ప్రత్యేక పూజలు

Published: Wednesday April 28, 2021
గొల్లపల్లి, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : ​జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం లోని గ్రామ గ్రామాన కొండగట్టు ఆంజనేయ స్వామికి కోటొక్క మొక్కులు చిన్న జయంతి వేడుకల్ని దేవాలయాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించారు. రకరకాల పూలమాలలతో సుందరంగా అలంకరించారు. పంచామృతాలతో, పండ్ల రసాలతో, పవిత్రమైన గోదావరి జలాలతో అభిషేకాలు చేశారు. ​సహస్రనామార్చనలు చేసిన అనంతరం... వివిధ రకాల ప్రసాదాలను ఆంజనేయ స్వామికి నివేదించారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉండడం వల్ల వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. అనంతరం స్థానిక ఆలయఆచార్యుల గురుస్వాముల సమక్షంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ హనుమాన్ దీక్షా భక్తులు గ్రామాల్లో జైశ్రీరాం జైహన్మాన్ భక్తి కీర్తనలను ఆలపించారు మాల విరమన చేసికొందరు స్వామి ముడుపులు చెల్లించి మరికొందరు కరోనా మహమ్మరి పీడ త్వరగా వెళ్లిపోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిఇంటిలో తోచిన విధంగా స్వామి వారి నామ జపం భజన శ్రవణం కీర్తనలను ఆలపించి సేవల్లో తరించారు.