మత సామరస్యంతో పండగలు జరుపుకోవాలి ఎమ్మెల్యే కార్పొరేటర్

Published: Monday May 03, 2021
మేడిపల్లి, మే 2 (ప్రజాపాలన ప్రతినిధి) : మత సామరస్యంతో పండుగలను జరుపుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు అందజేస్తున్న రంజాన్ కానుకలను రామంతపూర్ డివిజన్ శ్రీ రామాకాలనీలో గల మసీదు ఉస్మాన్ బిన్ అఫాన్లో ముస్లిం సోదరులకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు రంజాన్ కానుకలను అందజేశారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్ రావు, ప్రధాన కార్యదర్శి సంకూరీ కుమార స్వామి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవి కుమార్, బిజెపి నాయకులు శైలేందర్, సురేష్ గౌడ్, భాస్కర్ చారి తదితరులు పాల్గొన్నారు.