గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే కి భూములు ఇవ్వం

Published: Wednesday July 28, 2021
అధికారులు అభిప్రాయ సేకరణలో రైతులు ప్రకటన
మధిర, జులై 27, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం నుండి మధిర మండలం మీదుగా విజయవాడ వరకు నూతనంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రైతుల నుండి కావలసిన భూములను సేకరించేందుకు మంగళవారం ఖమ్మం ఆర్డిఓ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో బాధిత రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేశారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వ్యవసాయ భూములను ఎట్టిపరిస్థితిలో వదులుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సైదులు, బోనకల్లు ఎర్రుపాలెం మధిర మండలాల రైతులు పాల్గొన్నారు.