ఘనంగా గోరింటాకు మహోత్సవం

Published: Friday July 29, 2022

మంచిర్యాల టౌన్, జూలై 28, ప్రజాపాలన: ఘనంగా గోరింటాకు మహోత్సవం గురువారం రోజు మంచిర్యాల జిల్లా లోని గడప ఉషాదేవి రాజన్న , శ్రీ షిర్డీ సాయిరాం దేవాలయంలో, చైర్మన్ గడప రమేష్, కార్యనిర్వాహకులు గడప శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ఆషాడమాసం చివరి రోజు సందర్బంగా సాయి మహిళలు భక్తులు గోరింటాకు మహోత్సవం పండగ, తులసి మాత దగ్గర, మహిళా కోలాటం బృందం వాళ్ళు ఘనంగా గోరింటాకు ఒకరికి ఒకరు చేతులకు పెట్టుకొని, గోరింటాకు పండగ చాలా ఉత్సాహంగా చేసుకున్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.