కారు బీభత్సం, నుజ్జునుజైన 15 బైకులు 4కార్లు* - డ్రైవర్కు ఫిట్స్ రావడంమే ప్రధాన కారణం. -త్రుటిలో

Published: Friday March 03, 2023

చేవెళ్ల మార్చి 2 (ప్రజాపాలన): -

నిత్యం రద్దీగా ఉండే జర్నలిస్ట్ కాలనీ  చేవెళ్ల  మల్కాపూర్ రోడ్డుపై కారు బీభత్సవం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే మల్కాపూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి మల్కాపూర్ నుంచి చేవెళ్ల వస్తుండగా... ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక జర్నలిస్ట్ కాలనీ లోకి రాగానే డ్రైవర్ కు ఫిట్స్ రావడం స్పృహ కోల్పోయి ఎక్సలెటర్  పై బలంగా తొక్కడంతో కారు మితిమీరిన వేగాన్ని చేరి ఇంటి ముందు ఉన్న అరుగును ఢీ కొట్టి పక్కనే ఉన్న కారును డీకొని  ఏకంగా ఇంటి ప్రహరీ గోడ పైనుంచి ప్రయాణించింది. ప్రహరీ పక్కనే ఉన్న మరో కారును ఢీకొని రోడ్డు ప్రక్కన పార్కు చేసిన ద్విచక్ర వాహనాల పై పల్టీ కొట్టింది. కారు కింద పడ్డ ద్విచక్ర వాహనాలు తునా తునకలయ్యాయి. ఇంతటి బీభత్సవం సృష్టించిన కారు పూర్తిగా ధ్వంసం అయింది. కియా కంపెనీకి చెందిన ఈ కారులోని హెయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్ కు ప్రాణాపాయం తప్పింది. కారు డ్రైవర్ రాజశేఖర్ రెడ్డి చేతి ఫ్రాక్చర్ అయినట్టు విశ్వాసనీయ సమాచారం. హైదరాబాదులోని  ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలిసింది. హాలీవుడ్ మూవీ తరహాలో జరిగిన ఈ ప్రమాదం స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.