పాలను అమ్ముతూ పాడి రైతులు అభివృద్ధి చెందాలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Friday July 08, 2022
బెల్లంపల్లి జూలై 7 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గంలోని పాడి రైతులు పాలను అమ్ముతూ ఆర్థికంగా బలపడాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
గురువారం బెల్లంపల్లి పట్టణంలో జరిగిన విజయ పాల ఉత్పత్తిదారుల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు, ప్రభుత్వపరంగా పాడి రైతులకు కావలసిన అన్ని అవసరాలను తీరుస్తామని వాటిని వినియోగించుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని ఆయన హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కళ్యాణి-భీమగౌడ్ , వైస్ చైర్మన్ మోటపలుకుల రాజశేఖర్ , డైరెక్టర్లు, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ , కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస, నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు .