రసబాసగ జరిగిన మండల సర్వసభ్య సమావేశం.

Published: Saturday December 10, 2022
శంకరపట్నం డిసెంబర్ 09 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఉమ్మెంతుల సరోజన అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ   సమావేశానికి వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరిగిన పనుల నిధులు విడుదల కావడం లేదని సర్పంచులు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను సత్వరమే విడుదల చేయాలని వారు కోరారు.