వలిగొండ నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక

Published: Monday July 12, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి వలిగొండ మండలం నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక ఆదివారం ఆర్ బి ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా పడమటి దామోదర్ రెడ్డి ఆంధ్రప్రభ, గౌరవ అధ్యక్షుడిగా పెద్దిటీ దామోదర్ రెడ్డి నమస్తే తెలంగాణ, ప్రధాన కార్యదర్శిగా శివనాథుల రమేష్ సాక్షి, ఉపాధ్యక్షులుగా రాపోల్ పవన్ కుమార్ ధ్వని, ఆలకుంట్ల కృష్ణ సూర్య, సహాయ కార్యదర్శులుగా ఎమ్మే బాలరాజు వార్త, గన్నెబొయిన నర్సింహా అక్షరం, కోశాధికారిగా కట్ట శ్రీనివాస్ మరో కిరణాలు, కార్యవర్గ సభ్యులుగా యానాల సత్యనారాయణరెడ్డి ఆంధ్రభూమి, కూర శ్రీనివాస్ నవ తెలంగాణ, షాబుద్దీన్ వెలుగు, ఎర్ర శ్రీకాంత్ మెట్రో ఉదయం, వేలిమినేటి రమేష్ ప్రజా పాలన, సుక్క గణేష్ ప్రజా జ్యోతి, నజీబ్ దిశ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతామని అన్నారు.