త్వరలోనే ఉపాధ్యాయ ప్రమోషన్స్,బదిలీలు

Published: Monday July 12, 2021
మధిర, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలను చేపట్టబోతుందని PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు తెలిపారు. ఈ రోజు సిద్దిపేటలో PRTU రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులతో సమావేశం ఏర్పాటు చేసిందని ఈ సమావేశంలో రాష్ట్రనాయకులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ ఎం.ఎల్.సి లు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమై ముఖ్యమంత్రి వద్ద నుండి స్పష్టమైన హామీ వొచ్చినట్లు వారు తెలిపారని ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు మోతుకురి మధు తో కలసి తాను హాజరైనట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రమోషన్స్, బదిలీలు ముఖ్యమంత్రి హామీ మేరకు త్వరగా జరిగేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని పి.ఆర్.సి పై అనామలీస్ కమిటీ వేసి లోపాలను సవరించాలని సి.పి.యెస్ విధానాన్ని రద్దు చేయాలని 2003 డి.ఎస్.సి వారికి పాత పెన్షన్ వర్తింపచేయాలని 398 స్పెషల్ టీచర్స్ కు నోషనల్  ఇంక్రిమెంట్లు మంజూరీ చేయాలని ఉపాధ్యాయులకు మెరుగైన వైద్య సేవలు అందేలా నూతన హెల్త్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఆన్ లైన్ బోధన విజయవంతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పి.ఆర్.టి.యు నాయకత్వం పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు