సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ప్రచార బస్సుయాత్రను ప్రారంభించిన పార్టీ కేం

Published: Monday January 17, 2022

ఇబ్రహీంపట్నం జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తుర్కయాంజల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు, కళాకారులతో కూడిన బస్సుయాత్రను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ లు పార్టీ జెండా ఊపుతూ బస్సుయాత్రను ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు మాట్లాడుతూ నేడున్న సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ఈ నెల 22 నుండి 25 వరకు మూడు రోజుల పాటు తుర్కయాంజల్ జరిగే సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, ఇప్పటికే మహాసభల ఏర్పాట్లు అత్యంత జయప్రదంగా సాగుగుతున్నాయని ప్రతి మూడు సంవత్సరాలకోసారి జరిగే సిపిఎం మహాసభల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పరిస్థితులపై ప్రధానమైన చర్చలు జరుగుతాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన వాగ్దానాలు, అనుసరిస్తున్న విధానాలపై పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున చర్చించి పోరాటాలకు ప్రజల్ని మరోమారు సిద్దం చేసేందుకే ఈ బస్సుయాత్రను ప్రారంభిస్తున్నామని, ఈ ప్రచార యాత్ర నేటి నుండి వారం రోజుల పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాల్లో పర్యటించి పాలకవర్గాల విధానాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. అంతే కాకుండా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో పాటు జిల్లాలో ఉన్న స్థానిక సమస్యలను ఈ మహాసభల్లో చర్చించి ప్రజా ఉద్యమాలపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంతో పాటు పార్టీ నిర్మాణం, ప్రజాపునాధిని విస్తరించేందుకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో చర్చించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, బి.సామెల్, యం. చంద్రమోహన్, డి.జగదీష్ జి.కవిత, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.కిషన్, ఇ.నర్సింహా, ఏ. నర్సింహా, కె.జగన్, గోరెంకల నర్సింహా, తులసీగారి నర్సింహా, ఐ.భాస్కర్, కె.శంకర్, కె.శ్రీరామ్ మూర్తి, బి.శంకరయ్య,కె.వెంకటకృష్ణ, డి.శ్రీధర్, ప్రజనాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం.జె వినోద్ కుమార్, జీ. గణేష్, ప్రకాష్ కారత్, బి.శంకర్, కె.సత్యం, రవిందర్ రావ్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.