వలిగొండలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
Published: Wednesday March 24, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండలంలో మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు స్థానిక వైద్యాధికారి సుమన్ కళ్యాణ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ మండలంలోని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోతుకుంట గ్రామంలోని మోడల్ స్కూల్ లో 247 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో ఇద్దరికీ కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు వారిని హోమ్ క్వారెంటైన్ చేసి వారికి కరోనా పట్ల తీసుకోవలిసిన జాగ్రత్తలపై తగు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాము ఏపీఎం కృష్ణయ్య ల్యాబ్ టెక్నీషియన్ అరవింద్, హరిబాబు డిఈఓ వినోద్ ఏఎన్ఎంలు శోభారాణి, సంధ్య మేల్ వర్కర్ జే సత్తయ్య, ఆశా వర్కర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: