మన ఊరు మన బడితో సర్కారు బడులకు మహార్దశ

Published: Thursday February 02, 2023
* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 1 ఫిబ్రవరి ప్రజాపాలన : మన ఊరు మనబడి తో సర్కారు బడులకు మహార్దశ పట్టనుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.  బుధవారం మోమిన్ పెట్ మండల పరిధిలోని చాంద్రాయన్ పల్లి, అమ్రాది కుర్దు గ్రామాలలో గ్రామ సర్పంచులు పెద్దోళ్ళ అంజయ్య, సునీత మల్లేశంల అధ్వర్యంలో ఎంపిపి దబ్బని వసంత వెంకట్ అధ్యక్షతన
మండల పరిషత్ పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన మౌలిక వసతులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్కారు బడులను సంరక్షించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చిందన్నారు. బడులను బాగు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తుందన్నారు.
* గ్రామ పంచయతీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి : 
అమ్రాదికుర్దు గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మోమిన్ పెట్ పిఎసిఎస్ చైర్మన్ బండ విష్ణు వర్ధన్ రెడ్డి మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.