ఆసరా పెన్షన్ దరఖాస్తు ఉచితం

Published: Friday August 20, 2021
ఈ-జిల్లా మేనేజర్ సయ్యద్ మహమూద్ అలీ
వికారాబాద్ బ్యూరో 19 ఆగస్ట్ ప్రజాపాలన : జిల్లాలో 57 ఏళ్ళు నిండిన వారు ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఈ-జిల్లా మేనేజర్ సయ్యద్ మహమూద్ అలీ తెలిపారు. గురువారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని పలు మీ-సేవ కేంద్రాల రికార్డులు ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అర్హులు దరఖాస్తు చేసుకునే సమయంలో మీ-సేవాలో ఎలాంటి రుసుము చెల్లించకూడదన్నారు. మీ-సేవ సర్వీసులకు ఎవరైనా నిర్వాహకులు వసూళ్లకు పాల్పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1100కు లేదా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కోరారు.