ఉచిత వైద్య శిబిరం విజయవంతం

Published: Thursday November 24, 2022

మధిర నవంబర్ 23 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర పట్టణంలోని శ్రీ సత్య సాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ కోనా మోహన్ రావు నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ సందర్భంగా మధిర ఆయుర్వేదిక్ ఆసుపత్రి సీనియర్ వైద్యులు శ్రీలత మాట్లాడుతూ వరంగల్ ఆయుష్  ఉపసంచాలకులు రవి నాయక్ ఆదేశాల మేరకు మధిర ఆయుర్వేద ఆయుర్వేదిక్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి సేవా సమితి సహకారంతో మధిరలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఆయుర్వేదిక్ వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులనుండి ఉపశయనం పొందొచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో మెడకల్ ఆఫీసర్లు రాంప్రసాద్, శ్రీనివాసరావు, వెంకట్ లాల్, ఆయుష్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందులు రాంబాబు, కాంపౌండర్లు రమేష్, శిరోమణి, సలేహా బేగం, శ్రీను, సాయి శ్రీ సత్య సాయి సేవ సమితి జిల్లా కన్వీనర్ కోనా మోహన్ రావు, పుల్ల ఖండం చంద్రశేఖర్, మాధవరపు నాగేశ్వరావు, అనంత నాయుడు, వెంకట్రామిరెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు