మధిర నియోజకవర్గంలో ముగిసినా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర. మధిర జూన్ 17 ప్రజా పాలన ప్రతినిధ

Published: Thursday June 16, 2022

మధిర,బోనకల్,చింతకాని మండలాల్లో దిగ్విజయంగా కొనసాగిన పాదయాత్ర*
పాదయాత్ర ఖమ్మం పట్టణంలోకి ప్రవేశం.రేపు సాయంత్రం ఖమ్మంలో భారీ బహిరంగసభ..
వైయస్సార్తెలంగాణ ఆర్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ రోజు చింతకాని మండలంలో కొనసాగింది.గత 95 రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర చింతకాని మండలంలో ముగించుకొని  ఖమ్మం పట్టణంలోకి అడుగుపెట్టింది.పాదయాత్రలో మధిర నియోజకవర్గ కో ఆర్డినేటర్ కిషోర్ కుమార్ దొంతమాల షర్మిల వెంట అడుగులు వేస్తూ ప్రజాసమస్యలు వివరిస్తున్నాడు.మధిర నియోజకవర్గ కో ఆర్డినేటర్ కిషోర్ కుమార్ దొంతమాలకె కె డిఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా  మధిర,బోనకల్,చింతకాని మండలాల్లో విజయవంతంగా పాదయాత్ర కొనసాగింది.ఈ పాదయాత్రలో చింతకాని,బోనకల్,ఎర్రుపాలెం మండలాల నాయకులు వాకా వీరారెడ్డి,ఇరుగు జ్ఞానేశ్,కోటిరెడ్డి,పార్టీ నాయకులు సురేష్,లక్ష్మారెడ్డి,సైదా బాబు,మౌలాలి,మురళి తదితరులు పాల్గొన్నారు.