రూ10 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభోత్సవం

Published: Saturday October 02, 2021
మేడిపల్లి, అక్టోబర్ 1 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ డివిజన్లోని కామాక్షి పురం స్ట్రీట్ నెంబర్ 8 వద్ద రూ10 లక్షలతో (సేవరేజీ పైప్ లైన్ వర్క్)  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావులతో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కామాక్షి పురం స్ట్రీట్ నెంబర్ 8 నుండి వాసవి నగర్ వరకు 10 లక్షల వ్యయంతో పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, రామంతాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎం.డి. ముస్తాక్, టీఆర్ఎస్  నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి, గరిక సుధాకర్, రేపాక కుమారస్వామి,డాక్టర్ బి. వి చారి, కాలనీ సీనియర్ నాయకులు మేక బుచ్చి రెడ్డి, నాగరాజు, కాలని అధ్యక్షులు తమ్ములి రవి, ప్రధాన కార్యదర్శి నారాయణ దాస్, సుధాకర్ రెడ్డి, మరియు బిజెపి సీనియర్ నాయకులు రేవు నరసింహ కురుమ, వేముల వెంకట్ రెడ్డి, దుర్గేష్, లింగం పాల్గొన్నారు.