ఇబ్రహీంపట్నం పిబ్రవరి తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి *****ప్రజల ముందుకు ప్రగతి నివేదన పాదయాత్ర ప్

Published: Friday February 10, 2023

***సంక్షేమ పథకాలతోటే రాష్ట్రం అభివృద్ధి**

*పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి వరం బిఆర్ఎస్ పార్టీ*

*ఇండ్ల  నిర్మాణం కోసం మూడు లక్షలు ప్రభుత్వం*

  ఇబ్రహీంపట్నం నియోజవర్గం మంచాల మండలం చిత్తాపూర్ తిప్పాయిగూడ తాళ్లగూడ గ్రామంలో ప్రగతి నివేదిన యాత్ర భాగంగా
19వ రోజు చేరుకొని 235 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతున్న సందర్భంలో ఈ సందర్భంగా మంచి రెడ్డి   ప్రశాంత్ రెడ్డి  మాట్లాడుతూ ప్రజలకు ఉన్న సమస్యలు  పరిష్కరించడం కోసమే ఈ పాదయాత్ర ఉద్దేశమని చిత్తాపూర్ తిప్పాయిగూడ తాళ్లగూడ   గ్రామంలో దాదాపు 898 కోట్ల ఖర్చు చేసి  గ్రామానికి సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ 5 లక్ష రూపాయలు ముదిరాజ్ భవనాలు కొరకు ఐదు లక్షల రూపాయలు మంజూరు. చేనేత కార్మికులకు పథకం చేనేత కార్మికులకు 40 శాతం. అందజేతమన్నారు. అనేకమైన పనులు తో అభివృద్ధి చేసే విధంగా బిఆర్ఎస్ పార్టీ చేసిందని ఆయన తెలిపారు. ప్రజలకు అవసరము వచ్చే విధంగా ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ప్రభుత్వ మూడు లక్షల రూపాయలు అందిస్తుందని. అదే కాకుండా దళిత బంధు రైతుబంధు సీఎం రిలీఫ్ ఫండ్ మహిళలకు డ్వాక్రా భవనాలు శ్రీనిధి అనేకమైన సంక్షేమ పథకాలతోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో , ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, మంచాల మండలం ఎంపీపీ నర్మదా లచ్చిరాం, ఎంపీటీసీ సుకన్య రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్, ప్రధాన కార్యదర్శి బహుదూర్, యూత్ విభాగ నాయకులు పాదయాత్ర ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు,