అంబటపుడి మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలీ

Published: Tuesday June 22, 2021
మధిర, జూన్ 21, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెంపోలీస్ లాకప్ డెత్ లో మరణించిన కోమంట్లగూడెం గ్రామానికి చెందిన అంబటపుడి మరియమ్మ  కుటుంబానికి న్యాయం చేయాలని వారి కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం మరియు ఎక్సగ్రెసియా ఇచ్చి మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ  MRO గారికి వినతిపత్రం అందజేయడం జరిగిందిఈ కార్యక్రమంలో మండలం కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి. మండల ఉపాధ్యక్షులు బండారు నరసింహరావు, సొసైటీ అధ్యక్షులు కడియం శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, మధిర నియెజకవర్గం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, మండల నాయకులు పిల్లి బోసు, వెంకటనర్సయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు, దేవరకొండ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు...