గుడిసెల పేటలో మురికి కాలువ పునర్ నిర్మాణం

Published: Friday June 25, 2021
సర్పంచ్ మెతుకు స్వామి స్వరూప
వెల్గటూర్, జూన్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం గుడిసెల పేట గ్రామంలో చెడిపోయిన కాలువను పూడిక తీసి పునర్నిర్మాణము మరియు మరమ్మతుల పనులు చేస్తున్నట్లు ఈ కాలువలు త్వరలోనే వాడుకలోకి ఉందని గ్రామ సర్పంచ్ మెతుకు స్వరూప స్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మెతుకు శంకరయ్య ఇంటి నుండి వన్నె లచ్చిరెడ్డి ఇంటి వరకు ఈ పనులు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారని ఆయన తెలిపారు.