కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్..

Published: Thursday June 09, 2022
పాలేరు జూన్ 8 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి  సర్పంచ్ రాయపూడి నవీన్  తల్లీ గారి..యోగక్షమాలను అడిగి తెలుసున్న టి.పిసిసి ఉపాధ్యక్షులు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్,  
 అనంతరం సర్పంచ్ నవిన్ గారి  నివాసంలో వారి ఆధ్వర్యంలో  . ప్రెస్ మీట్ లో పాల్గొన్న  టి .పీసిసి ఉపాధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ.సంభాని చంద్రశేఖర్,
 వారు మాట్లాడుతూ వరంగల్   లో రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన రైతు  డిక్లరేషన్ ను ప్రజలలో  బలంగా తీసుకువెళ్లాలని అన్నారు
2023 ఎన్నికలే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు.
పాలేరు నియోజకవర్గం నాకు కన్నతల్లితో సమానం అని అన్నారు
ఈ నియోజకవర్గన్నీ అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు
తెలంగాణ రాష్ట్రంలో  హత్యాచార ఘటనలు ఎక్కువ అయి పోయాయి అని అన్నారు .అభంశుభం తెలియని పసిపిల్లలపై హత్యాచారాలు జరగడం చాలా బాధాకరం అని అన్నారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసారు అన్నారు
దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నారు
 రాష్ర్ట ముఖ్యమంత్రి మాటలకే పరిమితం అయ్యారు అని అన్నారు
 నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి సామాన్యులు బతికే.పరిస్థితి ఉంద అని ఆవేదన వ్యక్తంచేశారు
ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు .సర్పంచ్ రాయపూడి నవిన్. ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు బొందయ్య.మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న.జిల్లా మైనార్టీ నాయకులు షేక్.హుస్సేన్.మాజీ జెడ్పీటీసీ ఏడుకొండలు.మిస ముత్తయ్య.ఎంపీటీసీ దోసపటి శేఖర్. బీసీ సెల్ వెంకటేశ్వర్లు.మైనార్టీ సెల్.ఖాజామియా,
నాగిరెడ్డి.తదితరులు ఉన్నారు