సహకార బ్యాంకు 45 వసంతాలు

Published: Wednesday September 29, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 28, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న వ్యవసాయ సహకార సంఘం సహకార బ్యాంక్ అని బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ బండ్ల గూడ ఖల్సా వారి ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన 45వ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... 45 వసంతాలుగా ప్రజలకు ఉత్తమ సేవలు అందజేస్తూ, గుర్తింపు పొందిన ఈ సహకార బ్యాంకు మరెన్నో వసంతాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ బ్యాంకు నుండి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ శాతం ఇందులో ఖాతా దారులు కావడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, బ్యాంకు అధ్యక్షుడు సింగిరెడ్డి పెంటా రెడ్డి, కళ్లెం తిరుపతి రెడ్డి, కళ్లెం నిరంజన్ రెడ్డి,  సీఈవో ఎర్ర జైహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.