*విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి.* - చిప్పకుర్తి శ్రీనివాస్ టి వి య

Published: Friday December 30, 2022

మంచిర్యాల టౌన్, డిసెంబర్ 29, ప్రజాపాలన: విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని చిప్పకుర్తి శ్రీనివాస్ టి వి యు వి రాష్ట్ర కార్యదర్శి  డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఐ టి ఐ విద్యార్థులతో కలసి  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా రూ.3000 వేల కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు  వెంటనే చెల్లించాలని,హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జిలు పెంచి నేరుగా విద్యార్థులకే చెల్లించాలని డిమాండ్ చేశారు లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పవన్, తరుణ్, వేణు కుమార్ లు  తదితరులు పాల్గొన్నారు*