శాంతిఖని గనిలో క్విజ్ పోటీలు విజేతలకు బహుమతి ప్రధానం
Published: Wednesday November 16, 2022
బెల్లంపల్లి నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి:బొగ్గు నాణ్యత
వారోత్సవాల సందర్భంగా
మంగళవారం బెల్లంపల్లి శాంతిఖని గనిలో గని ఉద్యోగులకు అధికారులు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ క్విజ్ పోటీల్లో బొగ్గు నాణ్యతకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి గెలుపొందిన జె.సాగర్, ఎస్.రాజేష్, ఎస్. రంజిత్ లకు గని అధికారులు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో క్వాలిటీ ఇంచార్జి ఎండి.ముస్తఫా, ఫిట్ ఇంజనీర్ రాంబాబు, వెంటిలేషన్ అధికారి పూర్ణ చందర్, ఇంజనీర్ రామ్ సాగర్, సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, టీబీజీకెఎస్ ఫిట్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్, ఏఐటీయూసి ఫిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్, గని అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
Share this on your social network: