మానవత్వం చాటుకున్న రామాజిపేట్ గ్రామ పంచాయితీ సిబ్బంది

Published: Wednesday May 12, 2021
రాయికల్, మే 11 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం రామాజిపేట్ గ్రామానికి చెందిన వృద్ధ మహిళ మంగళవారం చనిపోయింది. ఆమె కుటుంబసభ్యులకు అంత్యక్రియలు నిర్వహించే స్థోమత కూడా లేకపోవడంతో గ్రామ పంచాయితీ సిబ్బందిని ఆశ్రయించారు. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే అంత్యక్రియలకు సంబందించిన పనులు మొదలు పెట్టి, గ్రామ పంచాయితీ వాహనంలో మృత దేహాన్ని స్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది, ఆశ వర్కర్లు, గ్రామానికి చెందిన కొంత మంది యువకులు పాల్గొన్నారు. అంత్యక్రియలు నిర్వహించిన  వారిని గ్రామ ప్రజలు అభినందించారు.